మే 9 నుండి 13 వరకు, సద్గురు టెన్నెస్సీలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్లో, దేవీ యొక్క అత్యున్నత స్వరూపమైన లింగ భైరవిని ప్రాణ ప్రతిష్ఠ అనే తీక్షణమైన ప్రక్రియ ద్వారా ప్రతిష్ఠించారు. ఒక సాధారణ రాతిని దేవతగా మార్చడానికి జీవశక్తిని ఉపయోగించే అరుదైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది. 3,600 మందికి పైగా సద్గురు సమక్షంలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని పొందారు. పశ్చిమ అర్ధగోళంలో ఈ తరహాలో మొట్టమొదటిదైన లింగ భైరవి ప్రతిష్ఠాపన వేడుకల నుండి కొన్ని దృశ్యాలు ఇవి. ఇప్పుడు లింగ భైరవి సన్నిధి అందరి దర్శనార్థం తెరిచి ఉంది.
Subscribe